ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం మండల కేంద్రంలో గురువారం నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం సందర్భంగా జరిగే తొట్టెల ఊరేగింపులో పాల్గొనాలని సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని టీం బజరంగ్ యూత్ సభ్యులు బుధవారం ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను యువత ముందుండి కాపాడాలని అన్నారు. దైవభక్తితో తనను ఆహ్వానించడానికి వచ్చిన యువతను అభినందిస్తూ, బోనాల తొట్టెల ఊరేగింపులో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు.యువతలో భక్తి భావం, సామాజిక బాధ్యత పెంపొందాలని ఆకాంక్షించారు.అనంతరం టీం బజరంగ్ యూత్ సభ్యులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించి ఆహ్వాన పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో టీం బజరంగ్ యూత్ సభ్యులు కావలి రోహిత్, కావలి వినయ్, భానుప్రసాద్, అంకుష్, ఉదయ్, యశ్వంత్, జ్ఞానదీప్, మనోజ్, సాత్విక్, పవన్, తేజ, నందు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు