ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఏఐసీసీ పిలుపు మేరకు నీట్-2026 పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసనగా ఆదివారం పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించినట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్-2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గత మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనల కారణంగా కోట్లాది మంది విద్యార్థులు అయోమయం, ఆందోళనకు గురయ్యారని ఆయన ఆరోపించారు. అలాగే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు రైతులు, కార్మికులు,యువతకునష్టాన్నికలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అక్షిత్, శ్రీనివాస్, ఐఎన్టీయూసీ కార్మిక నాయకులు రతన్సింగ్, మల్లేష్, అంజయ్య, రాజుసింగ్, వినోద్, రాములు, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు