Monday, 10 August 2026 10:49:04 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: కోల్కూరి నరసింహారెడ్డి

Date : 28 June 2026 11:41 AM Views : 47

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఏఐసీసీ పిలుపు మేరకు నీట్-2026 పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసనగా ఆదివారం పటాన్‌చెరు పట్టణ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించినట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్-2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గత మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనల కారణంగా కోట్లాది మంది విద్యార్థులు అయోమయం, ఆందోళనకు గురయ్యారని ఆయన ఆరోపించారు. అలాగే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు రైతులు, కార్మికులు,యువతకునష్టాన్నికలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అక్షిత్, శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ కార్మిక నాయకులు రతన్‌సింగ్, మల్లేష్, అంజయ్య, రాజుసింగ్, వినోద్, రాములు, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :