ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : మర్పల్లి : కొంశెట్పల్లి గ్రామ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు వీరేశం గౌడ్ బుధేరాలో నూతనంగా నిర్మించిన స్వగృహంలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మన్నే సుధాకర్, గ్రామ నాయకులు, సభ్యులు కలిసి వీరేశం గౌడ్ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరేశం గౌడ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. నూతన గృహంలో ఆయన కుటుంబ సభ్యులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
ప్రజా పిలుపు