ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : *పటాన్చెరు పట్టణ పరిధిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, 22 ఏళ్ల యువతి జూలై 30న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.తమ కుమార్తెను ఎవరో ప్రలోభపెట్టి తీసుకెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.యువతి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు