ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు పట్టణంలోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి చిన్నారులకు పోలియోp చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.పటాన్చెరు నియోజకవర్గంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు