ప్రజా పిలుపు / తెలంగాణ / రంగారెడ్డి : షాద్నగర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.జూలై 29 మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన సహాయ ఎన్నికల నమోదు అధికారుల నివేదిక ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం 2,44,426 మంది ఓటర్లలో 2,04,662 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి.దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియ 83.73 శాతం పూర్తయింది.మండలాల వారీగా పరిశీలిస్తే కొందుర్గులో 91.22 శాతం, కేశంపేటలో 90.15 శాతం, జిల్లేడ్-చౌదరిగూడలో 89.76 శాతం, ఫరూక్నగర్ గ్రామీణ మండలంలో 88.29 శాతం, కొత్తూరులో 88.15 శాతం, నందిగామలో 86.69 శాతం మేర డిజిటలైజేషన్ పూర్తైంది. అయితే షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 65.13 శాతం మాత్రమే పూర్తవడంతో అక్కడ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.నియోజకవర్గవ్యాప్తంగా ఓటర్ల నమోదు ప్రక్రియ 93.18 శాతం మేర పురోగతి సాధించగా, ఇంకా 16,661 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పెండింగ్లో ఉంది. వీరిలో అత్యధికంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10,847 మంది, ఫరూక్నగర్ గ్రామీణ మండలంలో 2,148 మంది, నందిగామలో 1,567 మంది, కొత్తూరులో 1,086 మంది ఓటర్ల వివరాలు నమోదు కావాల్సి ఉంది.ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఓటర్ల వివరాల నమోదు,డిజిటలైజేషన్ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని షాద్నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి సరిత విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు