Sunday, 09 August 2026 10:46:06 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

భారీ వర్షాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వాగులు, వంకలు, బ్రిడ్జిలను దాటొద్దు.. అత్యవసరమైతేనే బయటకు రావాలి– అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

Date : 30 July 2026 03:17 PM Views : 53

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ సూచించారు.భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలనికోరారు.ముఖ్యంగా వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించరాదని హెచ్చరించారు. నీటి ప్రవాహం తక్కువగా కనిపించినప్పటికీ దాని లోతు, వేగాన్ని అంచనా వేయడం కష్టమని, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు.అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ స్తంభాలు,తెగిపోయిన లేదా వేలాడుతున్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లరాదని సూచించారు.జిల్లాలో ప్రమాద అంచున ఉన్న ఆనకట్టలు, వాగులు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య, విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయంగా పనిచేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్‌ను సంప్రదించాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికారులు జారీ చేసే సూచనలను పాటిస్తూ ప్రజలు తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :