ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో గతంలో ఉన్న రైల్వే స్టేషన్ స్థలాన్ని అన్వర్ షరీఫ్ అనే వ్యక్తి కబ్జా చేశారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఆ స్థలంలో బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.రైల్వేకు చెందిన ప్రభుత్వ భూమిలో ఈ తరహా చర్యలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భూమి రికార్డులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే శాఖ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు