ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో అక్కమొల్ల సామయ్య నివాసంలో సోమవారంఅకస్మాత్తుగా బట్టలకు మంటలు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై వెంటనే పటాన్చెరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ ఉండటంతో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, సిబ్బందిఅప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
ప్రజా పిలుపు