Sunday, 09 August 2026 10:45:54 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

రూ.300 కోట్ల రూపాయలతో నిర్మించిన పటాన్‌చెరు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి:సీపీఎం డిమాండ్

Date : 21 July 2026 08:21 PM Views : 41

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఆస్పత్రి నిర్మాణం పూర్తై దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. జిల్లా నుంచే ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆస్పత్రి ప్రారంభంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని,స్థానికంగా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో బాధితులను హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో చికిత్స ఆలస్యం కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆస్పత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు, యంత్రాలు సుమారు ఆరు నెలల క్రితమే అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పటాన్‌చెరు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆస్పత్రినితక్షణమేప్రారంభించాలని, లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలతో పాటు రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజయ్య, పటాన్‌చెరు పట్టణ కార్యదర్శి బి.నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ, పి.పాండురంగారెడ్డి తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :