ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : మానవత్వమే మహోన్నతమైన సేవ అనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా విలువలను చాటుకుంది.రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి సమీపంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 50–60 సంవత్సరాల వయస్సు గల ఓ అనాధ వృద్ధురాలు రోడ్డుపై మృతదేహంగా కనిపించడంతో స్థానికులు వెంటనేపోలీసులకుసమాచారంఅందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు, బంధువుల ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని స్వీకరించిన ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఆమెకు పూర్తి గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించారు.జన్మనిచ్చిన వారు లేకపోయినా, చివరి ప్రయాణంలో అనాధలు ఒంటరిగా ఉండకూడదనే మానవతా దృక్పథంతో ఎండీఆర్ ఫౌండేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.సమాజంలో నిరాశ్రయులు, అనాధలకు చివరి వీడ్కోలు పలకడం కూడా తమ సామాజిక బాధ్యతగా భావిస్తూ సేవలు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు