ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీన్చౌక్, బండంకొమ్ము వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50–55 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఆటో ఢీకొనడంతో తీవ్ర తలగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.మృతుడు గులాబీ రంగు పూర్తి చేతుల చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎడమ చేతికి తెలుపు రంగు కడియం ఉంది. నలుపు, తెలుపు రంగుల గడ్డం ఉంది. ఎవరైనా గుర్తిస్తే అమీన్పూర్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ ఘటనకు సంబంధించి నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మిట్యా తండాకు చెందిన రామావత్ అనిల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఆటోను నిర్లక్ష్యంగా నడిపి పాదచారిని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు