ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో స్వల్ప వర్షానికే కాలనీ మొత్తం నీట మునిగిపోయేదని తెలిపారు. అయితే మెట్టు కుమార్ యాదవ్ చొరవతో ప్రత్యేక నిధుల ద్వారా వర్షపు నీటి కాలువలు నిర్మించడంతో ప్రస్తుతం వర్షపు నీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వెళ్లిపోతోందని పేర్కొన్నారు.అనంతరం కాలనీలో 11 అంతర్గత రహదారులు ఇప్పటికీ నిర్మించలేదని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మెట్టు కుమార్ యాదవ్ సంబంధిత ఇంజినీర్తో ఫోన్లో మాట్లాడి అన్ని రహదారులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో తాగునీటి సమస్య ఉందని స్థానికులు వివరించగా, వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గృహ గణన దరఖాస్తు పత్రాలు ప్రతి ఇంటికి చేరేలా సంబంధిత బూత్ స్థాయి అధికారికి సూచనలు చేశారు. ప్రతి కుటుంబం సహకరించి దరఖాస్తు పత్రాలను పూర్తిగా నింపి అందించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు