ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెల్లాపూర్ పట్టణ పరిధిలోని శ్రీకారం వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న సుమారు ఐదేళ్ల బాలుడు షణ్ముఖ్ స్కూల్ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు.ఈ ఘటన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు ఉదయ్ కుమార్, మనీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు