ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీలో ఆషాఢ మాస బోనాల పండుగ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్ రావు దేశ్పాండే పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఓదెల మాణిక్యరావు, కావ్య శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, ప్రవీణ్ యాదవ్, కృష్ణ వంశీ, శంకర్, సురేష్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు