ప్రజా పిలుపు / తెలంగాణ / వరంగల్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన ఆయనను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్తతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Admin
ప్రజా పిలుపు