ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో నిర్వహించిన "గిఫ్ట్ ఎ స్మైల్" కార్యక్రమంలో కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకుధ్రువపత్రాలు. అందజేశారు.పటాన్చెరు నియోజకవర్గ మహిళా నాయకురాలు పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ,పటాన్చెరు మండల ఇన్చార్జి, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుట్టుశిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపాధి నైపుణ్యాలు ఎంతో అవసరమని, కుట్టు శిక్షణ వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు తమకు అందించిన శిక్షణ జీవనోపాధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, రాజేష్, ఇస్నాపూర్ మున్సిపాలిటీ సహనియమిత సభ్యుడు బాబా నిజాముద్దీన్, సెయింట్ మేరీ విద్యాసంస్థల నిర్వాహకుడు విలియమ్స్, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, శిక్షణ పొందిన మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు