Monday, 10 August 2026 10:40:37 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సురక్షా తిరంగా' కార్యక్రమంలో 350 మంది విద్యార్థులకు సూచనలు

Date : 05 August 2026 06:31 PM Views : 31

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం;జాగృతి దివస్ సందర్భంగా బుధవారం ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీ మోడల్ కళాశాలలో సురక్షా తిరంగా – సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస కాకూడదని, అపరిచితులు పంపే ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, క్యూ ఆర్ కోడ్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు.ఇలాంటి చర్యల వల్ల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని వివరించారు.అలాగే ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు,పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పకూడదని, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. నకిలీ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, లాటరీలు,పెట్టుబడులు, గేమింగ్ రివార్డుల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ సహాయ కేంద్రానికి ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ సుధీర్ కుమార్, ఎస్సై అక్షిత, ఎస్సై కిష్టారెడ్డి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను సమర్థవంతంగా నివారించవచ్చని పోలీసులు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :