ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు మండల పరిధిలోని భానూర్ సమీపంలో గుర్తుతెలియని ఓ పురుషుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మానవత్వాన్ని చాటుతూ మాద్రి దాతృత్వ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకుడు మాద్రి పృథ్వీరాజ్ ఆర్థిక సహకారం అందించారు. అనాథలకు కూడా చివరి వీడ్కోలు గౌరవప్రదంగా ఉండాలనే సందేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. జీవితంలో సేవ... చివరి ప్రయాణంలోనూ గౌరవం" అనే లక్ష్యంతో సంస్థ మానవతా సేవలను నిరంతరం కొనసాగిస్తోందని వారు పేర్కొన్నారు
Admin
ప్రజా పిలుపు