ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రపురం పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఐలేష్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పోలియో నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా నిలబెట్టేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు