Monday, 10 August 2026 12:51:27 PM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

గడ్డిమందు సేవించి యువకుడు ఆత్మహత్య: బంగ్లా వెంకటాపూర్‌లో విషాదం

Date : 03 July 2026 07:33 PM Views : 56

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : :ఇంట్లో మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు గడ్డిమందు సేవించి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సల్లూరి అరవింద్ (26)ను గత ఆదివారం రోజున కుటుంబ సభ్యులు ఇంట్లో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్.. తన స్నేహితుని పొలానికి వెళ్లి అక్కడ గడ్డిమందు సేవించాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న అరవింద్ వరుసగా వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు.కొడుకు పరిస్థితిని చూసి అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో, తాను గడ్డిమందు తాగినట్లు అరవింద్ నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన అల్వాల్ లోని లోటస్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.మెరుగైన వైద్యం కోసం గురువారం సాయంత్రం అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అరవింద్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :