Monday, 10 August 2026 11:21:35 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

కంది సెంట్రల్ జైలును సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

జైలు భద్రతపై సమీక్ష.. నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని ఆదేశం

Date : 17 July 2026 04:05 PM Views : 36

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కంది గ్రామంలోని సెంట్రల్ జైలును జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) పరితోష్ పంకజ్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించి జైలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్‌తో కలిసి జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ, జైలులోని ఖైదీల కదలికలు, ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద పరిణామాలు గుర్తించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిషేధిత, హానికరమైన వస్తువులు జైలు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.జైలు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆకస్మిక తనిఖీలు తరచుగా చేపట్టాలని, సందర్శకుల తనిఖీలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. జైలు పరిసరాల్లో 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగిస్తూ సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా పర్యవేక్షించాలని, జైలు గోడలు, ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసి సెంట్రీ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు.అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందికి క్రమం తప్పకుండా మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని, జైలు భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్‌పీ సూచించారు.ఈ పర్యటనలో అదనపు ఎస్‌పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్, జైలు శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :