ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రంగానికి అండగా నిలుస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పులపాలైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే రూ.25 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వానాకాలం పంట సీజన్కు సంబంధించి 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గంలోనే 21 వేల మంది రైతులకు శనివారం నాటికి రూ.14 కోట్లు జమయ్యాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, కార్మిక సంఘం నాయకులు అంజయ్య, రాజు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు