Monday, 10 August 2026 09:41:54 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

రైతు భరోసాతో రైతులకు ఊరట

పటాన్చెరు నియోజకవర్గంలో 21 వేల మంది రైతులకు రూ.14 కోట్లు జమ

Date : 05 July 2026 09:00 PM Views : 60

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రంగానికి అండగా నిలుస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో అప్పులపాలైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే రూ.25 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గంలోనే 21 వేల మంది రైతులకు శనివారం నాటికి రూ.14 కోట్లు జమయ్యాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, కార్మిక సంఘం నాయకులు అంజయ్య, రాజు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :