ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) సంగారెడ్డి జిల్లా శాఖ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డిని కలిసి పలువురు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.సంగారెడ్డి జిల్లా టీజీఓ శాఖ కార్యకలాపాల నిర్వహణ కోసం ఫసల్వాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు సంఘ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. టీజీఓ జిల్లా శాఖ ప్రారంభం నుంచి ప్రైవేట్ భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దీంతో కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు తదితర కార్యక్రమాల నిర్వహణలో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా, ప్రభుత్వ ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు శారద, సంయుక్త కార్యదర్శి రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి వినయ్ కుమార్, కార్యవర్గ సభ్యురాలు పుష్పలతతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు