ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పటాన్చెరు నియోజకవర్గ మహాసభను విజయవంతం చేయాలని సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బాదిని శ్రీను, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యం పిలుపునిచ్చారు. పటాన్చెరులోని ఐబీ గెస్ట్ హౌస్లో నిర్వహించనున్న ఈ మహాసభకు నియోజకవర్గంలోని జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మహాసభలో జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు