Sunday, 09 August 2026 10:01:22 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి

తెల్లాపూర్‌లో ఎస్‌ఐఆర్ అవగాహన ర్యాలీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 25 July 2026 10:31 AM Views : 65

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెల్లాపూర్, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే బలమైన పునాది అని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఏలియన్స్ స్పేస్ స్టేషన్ అపార్ట్‌మెంట్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన ర్యాలీతో పాటు ప్రచార రథాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో నిర్ధారించుకోవడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు.ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు, ప్రచార రథాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, సంక్షేమానికి ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అందుకే ప్రతి అర్హుడైన ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచార రథాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :