ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ ఆవరణలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో 30 ప్రచార రథాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే సవరణలు చేసుకోవాలని, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ 30 ప్రచార రథాలు పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటరు నమోదు, మార్పులు–చేర్పులు, అభ్యంతరాల దాఖలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి.ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయకుమార్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎండీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ పృథ్వీరాజ్, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ పటాన్చెరు పట్టణ అధ్యక్షుడు కొమురగూడెం వెంకటేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు