Monday, 10 August 2026 10:49:16 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలిప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి: ఆదిత్యరెడ్డి*

Date : 17 July 2026 03:51 PM Views : 41

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పట్టణంలోని మున్నూరుకాపు ఫంక్షన్ హాల్‌తో పాటు జేపీ కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేసి, ప్రజాస్వామ్య హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్ రాజశేఖర్, దేవన్న, రాజన్న, పాషా భాయ్, ఫయాజ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :