ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్ : పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధి మారుతి నగర్ కాలనీలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది.ఈమహోత్సవంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆమెకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కాట సుధా మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలంతా ధర్మపరమైన కార్యక్రమాల్లో భాగస్వాములై భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు