ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజు జర్నలిజం రంగంలో నిబద్ధతతో సేవలందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సంజీవ, నవీన్, పురుషోత్తం, వివేక్ ,ప్రజా పిలుపు అధినేత విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు