ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్, జూన్ 28: ప్రతి చిన్నారి ఆరోగ్య రక్షణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి సహకరించాలని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీరంగూడ డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన పోలియో శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి విడతలోనూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు