ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు: కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సమర్థంగా సాధించుకోగలరని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్అన్నారు.ఆదివారం ఆయన నివాసంలో కోకా-కోలా కంపెనీ కార్మికులతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థలోని పరిస్థితులు, యూనియన్ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కాట శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.
Admin
ప్రజా పిలుపు