ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జన్నారం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కోమలి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు