ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల, ఆగస్టు 8: గత ఏడాది ఫలహారం బండి ఊరేగింపు సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈ ఏడాది బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులను ప్రశాంతంగా నిర్వహించేందుకు గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గుమ్మడిదల ఎస్ఐ గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి పండుగల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి కుల దూషణలకు పాల్పడకుండా, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని తెలిపారు.బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
Admin
ప్రజా పిలుపు