ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు, జూన్ 25 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు :జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని భగత్ గల్లి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో పరిష్కరించారు. గత ఏడాది కాలంగా బోరు మోటర్ పాడవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కాలనీ వాసులు ఆజాం, జబ్బర్లు మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. అనంతరం సొంత నిధులతో నూతన బోరు మోటర్ను ఏర్పాటు చేసి బోరుబావిలో బిగింపజేయడంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సమస్యను వెంటనే పరిష్కరించినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ మెట్టు కుమార్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలో వర్షపు నీరు నిలిచి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసి మట్టి వేసి ప్రాంతాన్ని చదును చేయించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మెట్టు కుమార్ యాదవ్, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలియజేయడంతో మెట్టు కుమార్ యాదవ్ కాలనీల్లో పర్యటించారు.జి హెచ్ ఎం సి సిబ్బందితో కలిసి పూడికతీత పనులు చేపట్టించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.
Admin
ప్రజా పిలుపు