Monday, 10 August 2026 11:21:05 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

కాలనీవాసుల విన్నపంతో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్*

Date : 25 June 2026 02:44 PM Views : 70

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు, జూన్ 25 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు :జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని భగత్ గల్లి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో పరిష్కరించారు. గత ఏడాది కాలంగా బోరు మోటర్ పాడవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కాలనీ వాసులు ఆజాం, జబ్బర్‌లు మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. అనంతరం సొంత నిధులతో నూతన బోరు మోటర్‌ను ఏర్పాటు చేసి బోరుబావిలో బిగింపజేయడంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సమస్యను వెంటనే పరిష్కరించినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ మెట్టు కుమార్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలో వర్షపు నీరు నిలిచి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసి మట్టి వేసి ప్రాంతాన్ని చదును చేయించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మెట్టు కుమార్ యాదవ్, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలియజేయడంతో మెట్టు కుమార్ యాదవ్ కాలనీల్లో పర్యటించారు.జి హెచ్ ఎం సి సిబ్బందితో కలిసి పూడికతీత పనులు చేపట్టించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :