ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలోని గాంధీ పార్క్ ఆవరణలో పౌర్ణమి సందర్భంగా శివ రహస్య టీం ఆధ్వర్యంలో గోవింద్ సింగ్ నేతృత్వంలో అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గోవింద్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజున కులమతాలకు అతీతంగా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో శివ రహస్య టీం సభ్యులు, సేవాభావం కలిగిన స్వచ్ఛంద కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు