ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలోని రామ్మందిర్కు వెళ్లే దారిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల చిన్నారి వంశీక భవనం పై అంతస్తు నుండి ఉదయం 11 గంటల సమయంలో పడి మృతి చెందిన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది స్థానికులు, చిన్నారి తండ్రి నాని తెలిపిన వివరాల ప్రకారం.. మూడో అంతస్తులో ఆడుకుంటున్న వంశీక అకస్మాత్తుగా కిందపడింది. తీవ్ర గాయాల కారణంగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Admin
ప్రజా పిలుపు