ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం సర్వీస్ రోడ్డుపై ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా చెల్లుబాటు అయ్యే వాహన పత్రాలు లేని, మోటారు వాహన చట్ట నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు కలిగిన 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని, మోటారు వాహన చట్టానికి అనుగుణంగా ఉన్న నంబర్ ప్లేట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ అక్షీత, ఎస్ఐ కిష్టారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు