Sunday, 09 August 2026 06:13:35 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

ఎస్‌ఐఆర్ శిబిరాల పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్

రాష్ట్రంలో 60 శాతం డిజిటలైజేషన్ పూర్తిగ్రామీణ ప్రాంతాల్లో 80%,పట్టణ ప్రాంతాల్లో 45% పూర్తయిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ*

Date : 17 July 2026 11:53 AM Views : 139

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 60 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని సుల్తాన్‌పూర్, ఐలాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ఆయన గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా శిబిరాల నిర్వహణ తీరును పరిశీలించి, బీఎల్వోలు, అధికారులతో మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వం గడువు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మేర ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బీఎల్వోలు, బీఎల్ఓల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.డిజిటలైజేషన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి భారీ సంఖ్యలో సిబ్బంది ఆన్‌లైన్‌లో పని చేయడంతో కొన్నిసార్లు సర్వర్ మందగించడం లేదా డౌన్ కావడం సహజమని, అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఎన్యూమరేషన్ పత్రాలు అందని వారు సంబంధిత సూపర్వైజర్లను సంప్రదించి వాటిని తీసుకుని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లా యంత్రాంగం, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, బిఎల్ఓ లు, బి ఎల్ ఏ లు పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :