ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 60 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆయన గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా శిబిరాల నిర్వహణ తీరును పరిశీలించి, బీఎల్వోలు, అధికారులతో మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వం గడువు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మేర ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బీఎల్వోలు, బీఎల్ఓల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.డిజిటలైజేషన్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి భారీ సంఖ్యలో సిబ్బంది ఆన్లైన్లో పని చేయడంతో కొన్నిసార్లు సర్వర్ మందగించడం లేదా డౌన్ కావడం సహజమని, అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఎన్యూమరేషన్ పత్రాలు అందని వారు సంబంధిత సూపర్వైజర్లను సంప్రదించి వాటిని తీసుకుని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లా యంత్రాంగం, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, బిఎల్ఓ లు, బి ఎల్ ఏ లు పాల్గొన్నారు
Admin
ప్రజా పిలుపు