ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నేపల్లి పర్యటన సందర్భంగా గాయపడిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పటాన్చెరు ఎమ్మెల్యే సోమవారం పరామర్శించారు.ఈ సందర్భంగా శంభీపూర్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని యోగక్షేమాలు విచారించారు. భగవంతుడి కృపతో ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు