ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని, ఆయన త్యాగం, ధైర్యసాహసాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ కుల సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.
Admin
ప్రజా పిలుపు