Sunday, 09 August 2026 06:13:56 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

నారాయణఖేడ్‌ మండలంలో వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ శ్రీశైలం*

Date : 27 June 2026 04:51 PM Views : 163

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్27:-సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్:ఇటీవల నారాయణఖేడ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ శ్రీశైలం సూచించారు.గత నెల రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు తాళాలు,బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారని తెలిపారు.కొన్ని ఇళ్లలో కనీసం ఐదు తులాల బంగారం వరకు చోరీకి గురైనట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నగదు,బంగారం,వెండి వంటి విలువైన వస్తువులను ఉంచవద్దని కోరారు.ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,ఒక గ్రాము బంగారం ధరతోనే ఇంటికి భద్రతను పెంచుకోవచ్చని సూచించారు.అలాగే,ఏదైనా పనిమీద ఊరు విడిచి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని,వీలైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా తెలియజేయాలని సూచించారు.ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, పోలీసుల సూచనలను పాటించి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ శ్రీశైలం విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :