ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్27:-సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్:ఇటీవల నారాయణఖేడ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ శ్రీశైలం సూచించారు.గత నెల రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు తాళాలు,బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారని తెలిపారు.కొన్ని ఇళ్లలో కనీసం ఐదు తులాల బంగారం వరకు చోరీకి గురైనట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేస్తూ, ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నగదు,బంగారం,వెండి వంటి విలువైన వస్తువులను ఉంచవద్దని కోరారు.ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని,ఒక గ్రాము బంగారం ధరతోనే ఇంటికి భద్రతను పెంచుకోవచ్చని సూచించారు.అలాగే,ఏదైనా పనిమీద ఊరు విడిచి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని,వీలైతే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేయాలని సూచించారు.ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, పోలీసుల సూచనలను పాటించి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ శ్రీశైలం విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు