ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : దారుర్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఆదివారం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి, గ్రామానికి చెందిన రైతు కంది భీమయ్యకు చెందిన 11 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.బాధితుడైన రైతు భీమయ్య తన మేకలను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన మేకల విలువ సుమారు రూ. 1,80,000 వరకు ఉంటుందని, తన జీవనాధారం కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, నష్టాన్ని అంచనా వేసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతు భీమయ్య కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు