Sunday, 09 August 2026 10:46:57 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

మానవత్వం చాటుకున్న 1993 పూర్వ విద్యార్థులు*

దివంగత మిత్రుడు యాదయ్య యాదవ్ కుమార్తెకు 1993 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

Date : 10 July 2026 08:41 PM Views : 124

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు పట్టణములో 1993 సంవత్సరం విద్యార్థులు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థి, ఎల్‌ఎల్‌బి మిత్రుడు గోకుల్ నగర్ నివాసి యాదయ్య యాదవ్ కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందడం పట్ల వారి బ్యాచ్ మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాదయ్య యాదవ్ కుమార్తె ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. అయితే, తండ్రి మరణంతో ఆమె కాలేజీ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మిత్రుల దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో, ఆమె విద్యాభ్యాసానికి ఎటువంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో 1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా ఒకటై మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ కలిసి రూ. 80,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ... ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతని, ఈ ఆర్థిక సహాయం ద్వారా ఆమె చదువు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యాదయ్య యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1993 బ్యాచ్‌కు చెందిన పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :