Monday, 10 August 2026 10:39:18 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

బీరంగూడ గుట్ట ఆలయంలో హరితహారం.. 5,200 మొక్కలు నాటనున్న వెల్స్ ఫార్గో

పర్యావరణ పరిరక్షణకు కార్పొరేట్ సంస్థల చేయూత అభినందనీయం: ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్

Date : 03 July 2026 07:42 PM Views : 120

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ, ప్రకృతి సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం సమాజానికి సానుకూల సంకేతమని బీరంగూడ గుట్టలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థ వెల్స్ ఫార్గో దేవాలయ ప్రాంగణంలో 5,200 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి దేవనాదం సమక్షంలో వెల్స్ ఫార్గో ప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ఆలయ పరిసరాలను పచ్చదనంతో నింపే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. దేవాలయం తరఫున నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి పెద్ద వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, మరిన్ని సంస్థలు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సభ్యులు, ఆలయ అర్చకులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, వెల్స్ ఫార్గో సంస్థ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను హరితవనంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :