ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 14వ వార్డ్, బూత్ నం.140,136,137 లలో మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గుమటం దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ ఓట్లును , మరణించిన వారి ఓట్లను తొలగింపు, చిరునామా మార్పులు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడం, అనర్హులను తొలగించడం అలాగే ఓటరు వివరాలు సక్రమంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి, ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ప్రక్రియను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, బీఎల్ఏ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు