ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ సిద్ధాంతకర్తగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతీకగా గుర్తింపు పొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ బస్టాండ్ ప్రాంగణంలో పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, స్వాభిమాన సాధనకు ఆయన చూపిన మార్గం ఆదర్శనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు ఐలేష్, పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, పార్టీ నాయకులు, కాలనీవాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు