Monday, 10 August 2026 07:55:55 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

అనుమానాస్పద స్థితిలో మహిళ హత్య

ఓ ఆర్ ఆర్ సర్వీస్. పై మృతదేహం లభ్యం – తలకు తీవ్ర గాయాలు – దర్యాప్తు ముమ్మరం

Date : 16 July 2026 03:00 PM Views : 141

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని చెట్ల ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతురాలిని సదాశివపేటకు చెందిన 40 ఏళ్ల మంజులగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పటాన్‌చెరు పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలి తలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను సంఘటన స్థలానికి తీసుకువచ్చి ఇనుపరాడ్లు, కట్టెలతో తలపై దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :