ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ ధనమైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ధనమైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు