ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : ప్రజా పిలుపు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నూతన సాంకేతికతతో రూపొందించిన ‘ఈ-సాక్ష్య’ (e-Sakshya) అప్లికేషన్ వినియోగంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ, నేర స్థలంలో సేకరించే డిజిటల్ సాక్ష్యాధారాలైన ఫోటోలు, వీడియోలను నేరుగా ఎఫ్ఐఆర్ (FIR) నంబర్తో అనుసంధానం చేయడం ద్వారా వాటిని ఎలాంటి మార్పులు, చేర్పులు (ట్యాంపరింగ్) జరగకుండా అత్యంత భద్రతతో భద్రపరచవచ్చని తెలిపారు. ఈ విధానం దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు న్యాయస్థానాల్లో నేర నిరూపణ శాతాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఈ-సాక్ష్య అప్లికేషన్ను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఈ-సాక్ష్య కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్యతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, ఈ-కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
ప్రజా పిలుపు