Sunday, 09 August 2026 06:13:35 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

పోలీసులకు ‘ఈ-సాక్ష్య’ అప్లికేషన్‌పై ప్రత్యేక శిక్షణ

Date : 24 June 2026 06:39 PM Views : 165

ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : ప్రజా పిలుపు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నూతన సాంకేతికతతో రూపొందించిన ‘ఈ-సాక్ష్య’ (e-Sakshya) అప్లికేషన్ వినియోగంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ, నేర స్థలంలో సేకరించే డిజిటల్ సాక్ష్యాధారాలైన ఫోటోలు, వీడియోలను నేరుగా ఎఫ్‌ఐఆర్ (FIR) నంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా వాటిని ఎలాంటి మార్పులు, చేర్పులు (ట్యాంపరింగ్) జరగకుండా అత్యంత భద్రతతో భద్రపరచవచ్చని తెలిపారు. ఈ విధానం దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు న్యాయస్థానాల్లో నేర నిరూపణ శాతాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఈ-సాక్ష్య అప్లికేషన్‌ను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, ఈ-సాక్ష్య కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్యతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, ఈ-కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :